Header Banner

చెన్నైలో ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు! 180 మంది ప్రయాణికులతో..

  Wed May 28, 2025 17:17        Travel

చెన్నై విమానాశ్రయంలో బుధవారం ఉదయం ప్రమాదం తృటిలో తప్పింది. సింగపూర్ నుంచి 180 మంది ప్రయాణికులతో వస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ల్యాండింగ్ సమయంలో సమస్యలు తలెత్తడంతో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. అయితే, పైలట్ల సమయస్ఫూర్తితో విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సింగపూర్ నుంచి బయలుదేరిన ఎయిర్‌బస్ విమానం బుధవారం ఉదయం 10:15 గంటలకు చెన్నై విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో విమానం వేగంగా కిందికి దిగడం, అదే సమయంలో ప్రతికూల గాలులు బలంగా వీయడంతో పరిస్థితి అదుపు తప్పుతున్నట్లు పైలట్లు గుర్తించారు. రన్‌వేకు కేవలం 200 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు, ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్లు వెంటనే ల్యాండింగ్‌ను రద్దు చేసుకుని 'గో-అరౌండ్' ప్రక్రియను చేపట్టారు.

 

ఇది కూడా చదవండి: సుప్రీం కోర్టును ఆశ్రయించిన మంచు విష్ణు… వారికి నోటీసులు కూడా అందాయి!

 

దీంతో విమానం తిరిగి గాల్లోకి లేచి, విమానాశ్రయం చుట్టూ చక్కర్లు కొట్టింది. సుమారు 30 నిమిషాల తర్వాత రెండో ప్రయత్నంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విమానం ల్యాండింగ్‌ను రద్దు చేసుకున్న విషయాన్ని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారులు ధృవీకరించారు. రన్‌వేలోని సెయింట్ థామస్ మౌంట్ వైపు ల్యాండింగ్ సమయంలో విమానం అస్థిరంగా ఉందని తెలిపారు. "సురక్షితమైన ల్యాండింగ్ కోసం విమానం కిందికి దిగే వేగం నియంత్రణలో ఉండాలి, సరైన వేగంతో పాటు రన్‌వేకు అనుగుణంగా ఉండాలి. ఈ సందర్భంలో, విమానం చాలా వేగంగా కిందికి దిగింది, అదే సమయంలో గాలుల వేగంలో ఆకస్మిక మార్పు వచ్చింది" అని ఓ అధికారి తెలిపారు. ఈ ఘటన చెన్నై విమానాశ్రయంలో ఇటీవలి ల్యాండింగ్ సంబంధిత సమస్యలపై మరోసారి ఆందోళనలను రేకెత్తించింది. గత ఏడాది అక్టోబర్‌లో జైపూర్ నుంచి వచ్చిన ఇండిగో విమానం కూడా ఇలాంటి కారణాలతోనే 'టచ్ అండ్ గో' చేయాల్సి వచ్చింది. అలాగే, ఈ ఏడాది మార్చిలో ముంబై-చెన్నై విమానం ల్యాండింగ్ సమయంలో తోక భాగానికి నష్టం వాటిల్లింది. 

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వ్యక్తిపై దాడి కేసు.. 3 రోజుల పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ!

 

లోకేష్క కీలక పదవి.. మహానాడులో ప్రతిపాదన.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన‌ ఎమ్మెల్యే!

 

ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. తారక్ ఎమోషనల్ పోస్ట్!

 

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?

 

కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?

 

ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్‌ 60 స్టైలస్‌.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..

 

టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..

 

ఏం అదృష్టం సార్..! అడ్డిమార్‌ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AirIndiaFlight #Mumbai #NewYork